21
గిబియోనీయులు సౌలు కుటుంబాన్ని శిక్షించమని కోరటం
దావీదు కాలంలో ఒకసారి కరువు సంభవించింది. ఆ కరువు మూడు సంవత్సరాలు కొనసాగింది. దావీదు యెహోవాను ప్రార్థించాడు. దావీదు ప్రార్థన ఆలకించి యెహోవా ఇలా అన్నాడు: “సౌలు, మరియు అతని హంతకుల కుటుంబం* హంతకుల కుటుంబం ‘రక్త పిశాసుల నిలయం’ అని పాఠాంతరం. ఈ కరువుకు కారణం. ఇప్పడీ కాటకం (కష్టం) సౌలు గిబియోనీయులను చంపివేసినందుకు వచ్చింది.” (గిబియోనీయులు ఇశ్రాయేలు వారు కాదు. చావగా మిగిలిన అమ్మోరీయులకు చెందిన ఒక గుంపువారు. ఇశ్రాయేలీయులు వారికి కీడు చేయబోమని గిబియోనీయులకు ఇశ్రాయేలీయులు … గిబియోనీయులకు యెహోషువ కాలంలో గిబియోనీయులు ఇశ్రాయేలీయులను మోసగించినపుడు ఇది జరిగింది. చూడండి యెహోషువ 9:3-15. ప్రమాణ పూర్వకంగా చెప్పియున్నారు. కాని సౌలు ఇశ్రాయేలీయుల పట్ల, యూదా వారి పట్ల ప్రేమకలవాడై గిబియోనీయులను చంపబూనాడు)
దావీదు రాజు గిబియోనీయులను పిలిచాడు. అతడు వారితో మాట్లాడాడు. “నేను మీకు ఏమి సహాయం చేయగలను? మీరు యెహోవా ప్రజలను యెహోవా ప్రజలను యెహోవా వారసత్వం అని పాఠాంతరం. దీవించేలాగున నేను ఇశ్రాయేలు వారి పాపాన్ని పోగొట్టటానికి ఏమి చేయాలి?” అని దావీదు గిబియోనీయులను అడిగాడు.
“సౌలు, అతని కుటుంబం వారు చేసిన పాపాలకు పరిహారంగా వెండి బంగారాలు ఇవ్వాలని అడిగే హక్కుగాని, ఇశ్రాయేలులో ఎవ్వరినైనా చంపేహక్కుగాని మాకు లేదు” అని గిబియోనీయులు దావీదుతో అన్నారు.
“అయితే మీకు నేనేమి చేయగలను?” అని దావీదు అడిగాడు.
అప్పుడు గిబియోనీయులు దావీదుతో ఇలా అన్నారు, “సౌలు మాకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. ఇశ్రాయేలులో మిగిలివున్న మా ప్రజలందరినీ సర్వనాశనం చేయాలని ప్రయత్నించాడు. సౌలు యోహోవాచే ఎంపిక చేయబడిన రాజు. కావున అతని ఏడుగురు కుమారులను మా వద్దకు తీసుకొని రా. వారిని మేము సౌలు యొక్క గిబియా పర్వతం మీద యెహోవా ఎదుట ఉరితీస్తాము.”
రాజైన దావీదు, “వారిని మీకు నేను అప్పగించెద” నని అన్నాడు. కాని రాజు యోనాతాను కుమారుడైన మెఫిబోషెతుకు రక్షణ కల్పించాడు. (యోనాతాను సౌలు కుమారుడు) ఆ మేరకు దావీదు యెహోవా పేరు మీద యోనాతానుకు ప్రమాణం§ దావీదు … ప్రమాణం దావీదు, యోనాతాను ఒకరి కుటుంబాలను మరియొకరు నాశనం చేయకూడదని ప్రమాణాలు చేసుకొనియున్నారు. చూడండి సమూయేలు మొదటి గ్రంథం 20:12-23, 42. చేసియున్నాడు. అందువల్ల రాజు వారిని మెఫీబోషెతుకు హాని చేయించలేదు. అయ్యా కుమార్తెయగు రిస్పాకు సౌలువలన పుట్టిన ఇద్దరు కుమారులను రాజు తీసుకున్నాడు. వారిద్దరి పేర్లు అర్మోని మరియు మెఫీబోషెతు* మెఫీబోషెతు ఈ మెఫీబోషెతు సౌలు కుమారుడైన యోనాతాను పుత్రుడు కాదు. రిస్పా కుమారులైన ఈ ఇద్దరినీ, మరియు సౌలు కుమార్తెయగు మెరాబునకు పుట్టిన ఐదుగురు కుమారులను రాజు తీసుకున్నాడు. (మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలువలన మెరాబునకు పుట్టిన వారీ ఐదుగురు పుత్రులు) దావీదు ఈ ఏడుగురు కుమారులను గిబియోనీయులకు అప్పగించాడు. అప్పుడు గిబియోనీయులు ఈ ఏడుగురిని గిబియా పర్వతంమీద యెహోవా సాన్నిధ్యంలో ఉరితీశారు. ఈ ఏడుగురు కుమారులు కలిసి చనిపోయారు. యవల ధాన్యంపంట కోత ప్రారంభకాలంలో వారు చంపబడ్డారు.
రిస్పా తన కుమారుల శవాలకు కాపలా వుండటం
10 అయ్యా కుమార్తె రిస్పా విషాద సూచకమైన ఒక వస్త్రం తీసుకొని కొండ అయ్యా కుమార్తె … కొండ ఇది గిబియోనులో ఉండే పెద్ద కొండ అయివుండవచ్చు ఇక్కడ కొండ అంటే అర్థం కొండమీద శవాలు పడివున్న చోట అనిగాని; ఆమె కుమారులు పాతిపెట్టబడిన చోటు అనిగాని అర్థం చెప్పవచ్చు. మీద పరచింది. ఆ వస్త్రం పంట కోతలు మొదలు పెట్టినపప్పటి నుండి దానిమీద వర్షం పడే వరకు ఆ కొండ మీద పర్చబడివుంది. పగటి వేళ పక్షులు వచ్చి తన కుమారుల శవాలను ముట్టకుండా రిస్పా చూచేది. రాత్రిళ్లు పొలాల్లో నుంచి జంతువులు వచ్చి కుమారుల శవాలను ముట్టకుండగనూ కాపాడేది.
11 అయ్యా కుమార్తెయు, సౌలు దాసి అగు రిస్పా చేస్తున్నదంతా ప్రజలు దావీదుకు చెప్పారు. 12 అప్పుడు దావీదు యాబేష్గిలాదు వారి నుండి సౌలు యొక్కయు, యోనాతాను యొక్కయు ఎముకలను తీసుకున్నాడు. (యాబేషు వారు ఈ ఎముకలను బేత్షానులోని పధ్రాన వీధి నుండి దొంగిలించారు. బేత్షానులోని ఈ వీధిలోనే గతంలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానుల శవాలను వేలాడదీశారు. గిల్బోవ వద్ద సౌలును చంపిన తరువాత ఫిలిష్తీయులు ఆ శవాలను వేలాడదీశారు) 13 దావీదు గిలాదు నుంచి సౌలు యొక్కయు, అతని కుమారుడైన యోనాతాను యొక్కయు ఎముకలను తెచ్చనాడు. తరువాత ప్రజలు ఉరి తీయబడిన సౌలు యొక్క ఏడుగురి కమారుల శవాలను సేకరించారు. 14 బెన్యామీనులోని సేలా అనేచోట సౌలు యొక్క అతని కుమారుడు యోనాతాను యొక్క ఎముకలను వారు పాతి పెట్టారు. శవాలను మాత్రం సౌలు తండ్రి కీషు సమాధియందు వారు పాతిపెట్టారు. రాజు యొక్క ఆజ్ఞాను సారం ప్రజలు ఇవన్నీ చేశారు. రాజ్యంలోని ప్రజల ప్రార్థన దేవుడు ఆలకించాడు.
ఫీలిష్తీయులతో యుద్ధం
15 దావీదుతో ఫిలిష్తీయులు మరల యుద్ధానికి దిగారు. దావీదు తన సైన్యంతో ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి తరలివెళ్లాడు. కాని దావీదు బాగా అలసిపోయి బలహీనపడిపోయాడు. 16 ఇష్బిబే నోబ అనే రెఫాయీముల సంతతి వాడొకడున్నాడు. ఇష్బిబే నోబ ఈటె మూడు వందల షెకెలుల మూడు వందల షెకెలు ఆంగ్లేయ తూకం ప్రకారం పదిహేడున్నర పౌనులు. ఇత్తడి ప్రమాణంలోవుంది. వానికొక కొత్త కత్తి కూడావున్నది. వాడు దావీదును చంపయత్నించాడు. 17 కాని సెరూయా కుమారుడైన అబీషై ఆ ఫిలిష్తీయుని చంపి, దావీదు ప్రాణం కాపాడాడు.
అప్పుడు దావీదు మనుష్యులు అతనికి ఒక ప్రమాణం చేశారు. “ఇకమీదట నీవు యుద్ధాలు చేయటానికి బయటికి వెళ్లరాదు. ఒక వేళ వెళితేమాత్రం నీవు చంపబడతావు. దానితో ఇశ్రాయేలు ఒక మహానాయకుని§ ఒక మహానాయకుని ఇశ్రాయేలుకు వెలుగునిచ్చే జ్యోతిని నీవు ఆర్పివేసిన వాడవవుతావు అని శబ్ధార్థం. కోల్పోతుంది,” అని చెప్పారు.
18 తరువాత గోబు వద్ద ఫిలిష్తీయులతో మరో యుద్ధం జరిగింది. అందులో హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీముల సంతతివాడగు సపును చంపాడు. సపు భయంకరాకారుడు.
19 ఫిలిష్తీయులతో గోబువద్ద మరో యుద్ధం జరిగింది. అక్కడ ఎల్హానాను అనువాడు గిత్తీయుడైన గొల్యాతును* గిత్తీయుడైన గొల్యాతు ఈ ఫిలిష్తీయుడు గొల్యాతు సోదరుడు. ఇతని పేరు లహ్మీ. చూడండి దినవృత్తాంతం మొదటి గ్రంథం 20:5. సంహరించాడు. ఎల్హానాను బేత్లెహేము వాడైన యహరేయోరెగీము అనువాని కుమారుడు. గొల్యాతు ఈటె సాలి వాని దోనెవలె మందంగా, పొడవుగావుంది.
20 గాతువద్ద మళ్లీ యుద్ధం జరిగింది. అక్కడ మహా కాయుడొకడున్నాడు. వాని కాళ్లకు, చేతులకు ఒక్కొక్కదానికి ఆరేసివ్రేళ్ల చొప్పున మొత్తము ఇరవై నాలుగువున్నాయి. అతడు రాక్షసాకారులగు రెఫాయీముల సంతతివాడు. 21 ఈ మనుష్యుడు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి కాలుదువ్వాడు. దావీదు సోదరుడైన షిమ్యా కుమారుడు యోనాతాను వానిని చంపివేశాడు.
22 ఈ నలుగురూ గాతుకు చెందిన భీకరుడైన రెఫా సంతతివారు. వీరంతా దావీదువలన, అతని సైనికుల వలన చంపబడ్డారు.

*21:1: హంతకుల కుటుంబం ‘రక్త పిశాసుల నిలయం’ అని పాఠాంతరం.

21:2: ఇశ్రాయేలీయులు … గిబియోనీయులకు యెహోషువ కాలంలో గిబియోనీయులు ఇశ్రాయేలీయులను మోసగించినపుడు ఇది జరిగింది. చూడండి యెహోషువ 9:3-15.

21:3: యెహోవా ప్రజలను యెహోవా వారసత్వం అని పాఠాంతరం.

§21:7: దావీదు … ప్రమాణం దావీదు, యోనాతాను ఒకరి కుటుంబాలను మరియొకరు నాశనం చేయకూడదని ప్రమాణాలు చేసుకొనియున్నారు. చూడండి సమూయేలు మొదటి గ్రంథం 20:12-23, 42.

*21:8: మెఫీబోషెతు ఈ మెఫీబోషెతు సౌలు కుమారుడైన యోనాతాను పుత్రుడు కాదు.

21:10: అయ్యా కుమార్తె … కొండ ఇది గిబియోనులో ఉండే పెద్ద కొండ అయివుండవచ్చు ఇక్కడ కొండ అంటే అర్థం కొండమీద శవాలు పడివున్న చోట అనిగాని; ఆమె కుమారులు పాతిపెట్టబడిన చోటు అనిగాని అర్థం చెప్పవచ్చు.

21:16: మూడు వందల షెకెలు ఆంగ్లేయ తూకం ప్రకారం పదిహేడున్నర పౌనులు.

§21:17: ఒక మహానాయకుని ఇశ్రాయేలుకు వెలుగునిచ్చే జ్యోతిని నీవు ఆర్పివేసిన వాడవవుతావు అని శబ్ధార్థం.

*21:19: గిత్తీయుడైన గొల్యాతు ఈ ఫిలిష్తీయుడు గొల్యాతు సోదరుడు. ఇతని పేరు లహ్మీ. చూడండి దినవృత్తాంతం మొదటి గ్రంథం 20:5.