125
యాత్ర కీర్తన.
యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు.
వారు ఎన్నటికీ కదలరు.
వారు శాశ్వతంగా కొనసాగుతారు.
యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి.
అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం కాపాడుతాడు.
దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా వశం చేసుకోరు.
దుర్మార్గులు అలా చేస్తే అప్పుడు మంచి మనుష్యులు కూడా చెడ్డ పనులు చేయటం మొదలు పెడతారేమో.
 
యెహోవా, మంచి మనుష్యులకు మంచి వాడవుగా ఉండుము.
పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచి వాడవుగా ఉండుము.
యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము.
వాళ్లు వక్రమైన పనులు చేస్తారు.
 
ఇశ్రాయేలులో శాంతి ఉండనిమ్ము.